సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.1.25 కోట్ల పరిహారం అందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే కోటి రూపాయల బీమా పథకం అమల్లో ఉండగా, ఇది అదనంగా అందుబాటులోకి రానుంది. సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు రూ.40 లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామని సింగరేణి సీఎండీ తెలిపారు.