పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సింగరేణి విస్తరించి ఉన్న 12 ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ నిషేధం అమలవుతుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తారు. సింగరేణి కార్యాలయాలు, గనులు, 50 కమ్యూనిటీ హాళ్లలోనూ ఈ నిషేధం వర్తిస్తుంది. ప్లాస్టిక్కు బదులుగా పేపర్ కప్పులు, స్టీలు/గాజు బాటిళ్లు, జనపనార సంచులు, స్టీలు డబ్బాలు వాడాలని అధికారులు సూచించారు.