Simhachalam Temple Chief Priest Ramanacharyulu Died: విశాఖపట్నం సింహాచలం అప్పన్న స్వామి ఆలయ ప్రధానార్చకులు ఐవీ రమణాచార్యులు (58) గుండె సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. 1992లో దేవస్థానంలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, 2020లో ప్రధానార్చకులుగా పదోన్నతి పొందారు. ఆయన మృతి పట్ల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అడివివరం పుష్కరిణి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.