హైదరాబాద్లోని ప్యాట్నీ సెంటర్లో ఆదివారం (మార్చి 04న) రోజు రాత్రి ఎస్బీఐ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదో అంతస్తులో మంటలు చెలరేగి.. ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.