సికింద్రాబాద్ అల్వాల్లో వాచ్మెన్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. నగదు, ఆభరణాలు కనిపించకపోవడంతో దోపిడీ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లొచ్చిన దంపతుల హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.