రైల్వే స్టేషన్లలో పెరుగుతున్న చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వేశాఖ నడుం బిగించింది. సికింద్రాబాద్తో పాటు దేశంలోని ఏడు ప్రధాన స్టేషన్లలో అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. రూ.720 కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సికింద్రాబాద్లో ఈ ఏఐ ఆధారిత కెమెరాలు దొంగలను సులభంగా పట్టుకోనున్నాయి. బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఈ కెమెరాలు ఏర్పాటు చేయగా.. 90 రోజుల్లో 47 మంది అనుమానితులను పట్టుకున్నాయి.