హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టతలపెట్టిన సికింద్రాబాద్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించ తలపెట్టగా.. గతేడాదే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధిన భూములకు రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ రాగా.. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.