బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే.. సిట్టింగ్ నేతలకు కూడా సీటు ఇవ్వను అంటూ గట్టి హెచ్చరికలు చేశారు. పార్టీ రూల్స్ ఉల్లంఘించినా, కార్యకర్తలను పట్టించుకోకపోయినా ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో చేసే డ్రామాలు ఎల్లప్పుడూ పనిచేయవని గులాబీ నేతలకు సూచించారు. నేతల పనితీరు ఆధారంగానే వారికి గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్న నేతలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.