రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ పథకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని దరఖాస్తుదారులు నమ్మవద్దని సూచించారు. రాజీవ్ యువ వికాసం ఎంపికకు దరఖాస్తుదారులకు సిబిల్ స్కోర్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక జూన్ 2వ తేదీ నాటికి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని తేల్చి చెప్పారు.