రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదల ఈఈ అమరేందర్రెడ్డి రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అధికారులు వస్తున్నారని తెలుసుకుని డబ్బును కుమారుడి టీషర్ట్లో చుట్టి ఇంటి బయటకు విసిరేశాడు. ఆ తర్వాత అమాయకుడిలా నటించాడు. అయితే సీసీటీవీ ఫుటేజీతో అతని బండారం బయటపడింది. ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.