సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల తీరును స్వయంగా తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. తాజాగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. పలు పథకాలు, సేవల అమలుపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రజలకు అందే పథకాలు, సేవలపై వచ్చే నెల 12వ తేదీ తర్వాత తనిఖీలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఆర్టీసీలో సౌకర్యాలు, సేవలను ఇంకా మెరుగుపరచాలని సూచించారు.