గజ్వేల్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ శ్రేణులు చొచ్చుకెళ్లటం రాజకీయంగా పెను దుమారం రేపింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు కిటికీల అద్దాలు ధ్వసం చేయటంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్కు ప్రైవేట్ సైన్యంలా మారారని మండిపడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు.