తెలంగాణ సీఎం రేవంత్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ హస్తిన వెళ్లనున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు నేతల్లో టెన్షన్ నెలకొంది.