బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్కు హైడ్రా కూల్చివేత నోటీసులు ఇవ్వటంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన చేస్తోందని.. సీఎం శాడిస్ట్ అని విమర్శించారు. ఇంటిలిజెన్స్ సమాచారం లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని, ప్రజల జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. సామాన్యులు, పేదల ఇండ్లను కూల్చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.