క్యాన్సర్ బారిన పడి.. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న బాధితుడికి సీఎం రేవంత్ రెడ్డి ఆపన్న హస్తం అందించారు. తమ వద్ద ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసినా.. చికిత్సకు సరిపోలేదు. దీంతో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం రూ.5 లక్షలు అందించారు. మరో రూ.7 లక్షలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించారు. దీంతో వారు కుటుంబ సభ్యులంతా కలిసి.. సచివాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు చెప్పారు.