తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రూ. 1.35 కోట్ల రూపాయలతో హెచ్ఎండిఏ ఈ పునరుద్ధరణ పనులు చేపట్టనుంది. ఎన్టీఆర్ ఘాట్ తెలుగు జాతికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా నిలుస్తుందని లోకేష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ సేవలను గుర్తించిందని ఆయన కొనియాడారు.