మేడ్చల్ జిల్లా జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మే 15లోగా అధికారుల నివేదిక కోరిన ఆయన.. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించి నూతన డంపింగ్ యార్డులపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. వ్యర్థాల నిర్వహణపై విదేశీ పద్ధతుల అధ్యయనానికి అఖిలపక్ష బృందాలను పంపుతామని వెల్లడించారు. ఈ సమస్యపై బీజేపీ ఎంపీ ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలవగా ఈ మేరకు హామీ ఇచ్చారు.