కామారెడ్డి జిల్లాలోని కుర్దు వంతెన మరమ్మత్తులకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మించనున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.