ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అంశం మీద టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. సీఎంగా పనిచేసిన రోజుల్లో అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు అదేనంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ఆరోజు.. తనకు మంచి పని చేశాననే తృప్తి కలిగిందంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.