తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాజీనామా చేయనున్నారన్న వార్తలు సచివాలయం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెలాఖరున ఆమె పదవి ముగియనున్న నేపథ్యంలో.. రాజీనామా వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. శాంతి కుమారి స్థానంలో రామకృష్ణారావు కొత్త సీఎస్గా నియమించబడతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి పదవి కాలం ముగియకముందే శాంతి కుమారి రాజీనామా చేయటం వెనుక కారణమేంటీ అన్న చర్చ నడుస్తోంది.