ఇంజనీరింగ్ కోర్సులలో మంచి డిమాండ్ ఉండే కోర్సు సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్). అందుకే సీఎస్ఈ సీటు కోసం యువత ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఆంధ్రా యూనివర్సిటీలో మాత్రం సీఎస్ఈ కోర్సులో సీట్లు మిగిలిపోయాయి. రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తయ్యే సరికి 22 సీట్లు భర్తీ కాలేదు. మరోవైపు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.