తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను ప్రశంసించారు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ప్రధాని మోదీ కూడా భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన కొనియాడారు. హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ కృషిని గుర్తు చేసుకున్న మల్లారెడ్డి.. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తేనే పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.