ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే సీప్లేన్ సర్వీసులు ప్రారంభించే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే విజయవాడ శ్రీశైలం మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమరావతి, గండికోట, తిరుపతిలో ప్రారంభించేందుకు చర్యలు మొదలయ్యాయి. తిరుపతి కళ్యాణి డ్యామ్ జలాల్లో ఏరోడ్రోమ్ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.