కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయగా.. దీనిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం అనుమతి కూడా అవసరమని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. కేంద్రం నిర్ణయం కీలకమని చెప్పారు.