కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం కేసీఆర్, హరీష్ రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు నిరసనలకు పిలుపునిచ్చింది.