ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. సింగరేణి సంస్థలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎంలను డిమాండ్ చేశారు. తన డిమాండ్ను పట్టించుకోకపోతే.. సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తేల్చి చెప్పారు. సింగరేణిలో భారీగా అవినీతి పెరిగిపోతోందని.. అందులో 10 శాతం కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇక సింగరేణి ఎన్నికల్లో హిందూ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు.