ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ సుచిత్ర ఎల్లాను కీలక పదవిలో నియమించింది. సుచిత్ర ఎల్లాను ఏపీ చేనేత, హస్తకళల అభివృద్ధి గౌరవ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే డీఆర్డీవో మాజీ చీఫ్ సతీష్ రెడ్డిని ఏరో స్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా, కేపీసీ గాంధీని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.