AP Sudhar Mart Products: ఏపీ ప్రభుత్వం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 'సుధార్ మార్ట్'ను ప్రారంభించింది. విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఖైదీల జీవితాల్లో మార్పు కోసం జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఖైదీలు తయారుచేసిన వస్తువులు, కూరగాయలు తక్కువ ధరలకే లభిస్తాయి. దుప్పట్లు, బెడ్షీట్లు, బ్లీచింగ్ పౌడర్, కేకులు, కూరగాయలు వంటివి మార్కెట్ ధరల కంటే తక్కువకు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్ట్ ద్వారా వచ్చే డబ్బును ఖైదీల సంక్షేమానికి ఉపయోగిస్తున్నారు.