Supreme Court Kakinada Couple Divorce Case: సుప్రీంకోర్టులో కాకినాడకు చెందిన దంపతుల విడాకుల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి తెలుగులో మాట్లాడారు. ఇరువురి మధ్య రాజీ కుదరకపోవడంతో విడాకులు మంజూరు చేశారు. కుమారుడి పేరు మీద రూ.45 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. గతంలోనూ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడి రాజీకి ప్రయత్నించగా, ఇప్పుడు జస్టిస్ భట్టి కూడా అదే తరహాలో వ్యవహరించడం విశేషం.