ప్రముఖ కమ్యూనిస్ట్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. సురవరం ఆస్తిని ప్రజలకు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చింది. సురవరం సుధాకర్ రెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమిని ప్రజా, యువజన అవసరాల కోసం వినియోగించాలని ఆయన భార్య కోరారు. సురవరం సుధాకర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భౌతికకాయాన్నా ఆస్పత్రికి డొనేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్తిని కూడా ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించడంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.