హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో సరికొత్త వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. ఇకపై సూదితో పొడిచే పని లేకుండానే.. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు నిర్వహించవచ్చు. కృత్రిమ మేధస్సు ఆధారిత ఈ సాంకేతికతను అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు విస్తరిస్తామని నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. ఆ వివరాలు..