సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. లింగగిరి రోడ్డులోని ఏటీఎంను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు.. రూ. 20 లక్షల నగదును అపహరించారు. లగ్జరీ ఫార్చ్యూనర్ కారులో వచ్చిన ఇద్దరు దుండగులు కటింగ్ మిషన్, స్ప్రే బాటిల్తో ఏటీఎంను 15 నిమిషాల్లోనే చోరీ చేసి ఆపై యంత్రాన్ని తగలబెట్టి పారిపోయారు.