తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నిరసనలు ఉద్ధృతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని, సచివాలయాన్ని ముట్టడించారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.