తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగకు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు (public holiday) ప్రకటించాలని కోరింది. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కన్వీనర్ ఏలూరి శ్రీనివాస్ రావు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇచ్చిన ఆప్షనల్ హాలిడేను సాధారణ సెలవుగా మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు పండుగలో పాల్గొనేందుకు ఈ సెలవు చాలా ఉపయోగపడుతుందని వారు తెలిపారు.