సెల్ ఫోన్లు ఇవ్వండి.. దేశం విడిచి వెళ్లొద్దు.. కేటీఆర్‌కు ఏసీబీ ఆదేశాలు

4 hours ago 1
ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అధికారులు ఎనిమిది గంటలపాటు ప్రశ్నించారు. రేసు నిర్వహణలో నిధుల మళ్లింపు, ఒప్పందాల ఉల్లంఘనపై ఆరా తీశారు. 2021-24 మధ్య వాడిన ఫోన్లను ఇవ్వాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. గ్రీన్ కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్లపై కూడా ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఇదివరకే జనవరి 9న కేటీఆర్‌ను విచారించిన విషయం తెలిసిందే.
Read Entire Article