తెలంగాణలో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 69 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులే (BLC పద్ధతిలో) రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పూర్తి చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి ఇదివరకే వెల్లడించారు. అరకొరగా పూర్తైన ఇళ్లకు కనీస వసతుల కోసం ప్రభుత్వం రూ. 640 కోట్లు ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు, అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్లను ఆగస్టులోగా పూర్తి చేసి పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంట భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో రూ.5 లక్షలు అందించి ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించనున్నారు.