Sonu Sood Ambulance In Parvathipuram: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ నాలుగు అంబులెన్స్లను అందించింది. సోనూసూద్ను చంద్రబాబు అభినందించారు. అయితే సోనూసూద్ ఏపీ ప్రభుత్వానికి అందించిన అంబులెన్సులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటిలో రెండు అంబులెన్సుల్ని పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు.. ఈ మేరకు జిల్లా కేంద్రానికి రెండు అంబులెన్సులు చేరుకున్నాయి.