సోషల్ మీడియా ఫేక్ పోస్ట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనిపై సీఎం చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్లకు ఆధార్ కార్డులతో జవాబుదారీతనం తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మంత్రివర్గ సమావేశం తర్వాత.. మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై చర్చించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.