సోషల్ మీడియాలో అసభ్యకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పదజాలం వాడకుండా ఆటో బ్లాకింగ్ విధానం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది. రాజకీయ నేతలు, ప్రముఖులపై ట్రోల్స్ను నియంత్రించాలని, పౌరుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు తగిన సూచనలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.