TTDevasthanams Accounts Reached 1 Million: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు టీటీడీ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు బాగా పెరిగారు. ఇటు బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.