విశాఖపట్నంలో వినూత్న తరహా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటర్ డిక్కీలను లక్ష్యంగా చేసుకుని విలువైన వస్తువులను దొంగిలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు డిక్కీ దొంగతనాల ద్వారా రూ.6.28 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుండి రూ.5 లక్షల నగదు, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.