సమాజంలో నిత్యం ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని ఘటనలు.. ప్రపంచం అభివృద్ధి వైపు ఎంతలా దూసుకుపోతుందో చెప్తాయి.. అదే మరికొన్ని ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. రోజురోజుకూ మనిషి.. రాతియుగంలోకి తిరోగమిస్తున్నాడా అనే సందేహాలను, అనుమానాలను లేవనెత్తుతాయి. అలాంటి ఘటనే శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. వినడానికి వికారం పుట్టించేలా, ఇలాంటి రాక్షసుల నడుమ మనం జీవిస్తున్నామా అనే భయం కలిగేలా జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. అమాయకపు ఆడపిల్ల జీవితంతో.. కొంతమంది కామాంధులు సాగించిన కీచక పర్వం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.