చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా నందలూరులో ఓ ఉపాధ్మాయురాలు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో చైన్ స్నాచర్.. చోరీకి పాల్పడ్డాడు. స్కూటీ మీద వెళ్తున్న ఆమెను ఫాలో అయిన ఆగంతకుడు.. అవకాశం చూసి ఆమె మెడలోని బంగారు నగలను లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ మహిళ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆగంతకుడు నగలతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.