తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అమలు అవుతున్న సీలింగ్ రిజర్వేషన్ కోటాను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరును ఖరారు చేసింది. అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ను ఎంపిక చేశారు.