సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం రోజున జరిగిన సీఎల్పీ సమావేశంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కాగా.. గ్రామాల్లో ఏకగ్రీవాలు అయ్యేలా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.