తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లకు ఒక విడత, బోధన్కు మరో విడత పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. పూర్తి వివరాల కోసం ఇది చదవండి.