స్థానిక సంస్థలకు ఎన్నికలు జులైలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుల గణన కారణంగా ఎన్నికలు వాయిదా పడినప్పటికీ, నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతున్నందున ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ నాయకులతో సమావేశమై ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని చెప్పగా.. వారు కూడా సమ్మతించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చిహ్నాల ఖరారు, బ్యాలెట్ పత్రాల ముద్రణ వంటి ముందస్తు ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది.