ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా దామినేడులో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం 28.37 ఎకరాల భూమిని శాప్కు కేటాయించింది. ఏపీ టూరిజం అథారిటీకి చెందిన ఈ భూమిని శాప్కు ఉచితంగా బదిలీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.