సైబర్ నేరగాళ్లు రోజుతో తరహా కొత్త మోసాలతో ప్రజలను లూటీ చేస్తున్నారు. తాజాగా.. 'ఆర్టీవో ట్రాఫిక్ చలానా.ఏపీకే' పేరుతో వాట్సప్ మెసేజ్లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ APK ఫైల్ లింక్లను క్లిక్ చేస్తే మీ క్రెడిట్కార్డు, బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేసే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది. అపరిచిత లింక్లపై క్లిక్ చేయవద్దని, యాప్లను అధికారిక స్టోర్ల నుంచే డౌన్లోడ్ చేయాలని సూచించింది.