కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫలితాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు ఐదు అవార్డులు రావడం విశేషం. విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాలు సత్తా చాటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి నారాయణ అవార్డులు అందుకున్నారు. స్వచ్ఛతకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయానికి ప్రజల సహకారం ఎంతో అవసరం అని తెలిపారు.